గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ: నగర శివారులో ని ఖానాపూర్ చౌరస్తా వద్ద బీహార్ కి చెందిన రాంనాథ్ మెహతా అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. అక్కడే గంజాయి సేవించిన ఏడుగురిని పట్టుకొని, వారికి టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చింది.గంజాయి అమ్మే వ్యక్తి పై గంజాయి తాగిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.