. . . వివరాలు వెల్లడించిన నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నవీపేట్ వెళ్లేందుకు నిజామాబాద్ బోధన్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న గుగులోత్ గోపాల్ అనే వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని అతని వద్ద నుంచి రూ.5 వేల నగదును, సెల్ ఫోన్ లాక్కున్న షేక్ హర్షద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 3న రెంజల్ మండలం కిషన్ తాండకు చెందిన గుగులోత్ గోపాల్ నిజామాబాద్ లో మేస్త్రీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బోధన్ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా షేక్ హర్షద్ తన ఆటోలో గుగులతో గోపాల్ ను ఎక్కించుకుని నవీపేట్ వెళ్లే దారిలో గుండారం వద్ద ఆటో నిలిపి గోపాల్ వద్ద నుంచి రూ.5 వేలు నగదు, సెల్ ఫోన్ ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. షేక్ హర్షద్ ను మంగళవారం సారంగాపూర్ వద్ద అరెస్టు చేసి ఆటోను సీజ్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 14 రిమాం