మల్కాపూర్ గుట్టను పొతం పట్టిండ్రు
రూరల్ మండలం మొరం నవీపేట్ కు తరలింపు ఇండస్ట్రీయల్ కారిడార్ లో అడ్డగోలు తవ్వకాలు రాత్రయిందంటే టిప్పర్ల హోరు ధ్వంసమౌతున్న గ్రామీణ రోడ్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ శివారులో గుట్టలను మొరం మాఫియా చెరబట్టింది. స్థానికంగా గుండారంకు చెందిన వారు మల్కాపూర్ కు చెందిన మరికొందరు కలిసి మల్కాపూర్ గుట్టలకు ఎసరుపెట్టారు. మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ద అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రక్కన ఉన్న గుట్టను రాత్రి, పగలు తొలిచేస్తున్నారు. 200 జేసీబీలతో కుల్లబొడుస్తున్నారు. స్థానికంగా గ్రామస్తులకు తాగునీరు...