మోర్తాడ్ బతుకమ్మ : డిసెంబర్ ఒకటో తేదిన హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగబోయే “మాలల సింహగర్జన” కు సంబంధించిన వాల్ పోస్టర్ ను జిల్లా నిజామాబాద్ బాల్కోండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని మాల అంబేడ్కర్ చైతన్య యువజన సంఘ భవనంలో సంఘం అద్యక్షుడు ముద్దం సృజన్, కార్యవర్గం సభ్యులు, ఆవిష్కరించారు. ఒకటవ తారీఖున జరిగే సింహగర్జనకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చి సభను విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ మాలల సత్తా చూపించాలని, మన పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో అంబేడ్కర్ వారసులు, మేధావులు, యువత రాజకీయ పార్టీలకు అతీతంగా, వివిధ సంఘాల నేతలు, అంబేడ్కర్ యువజన సంఘాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చైతన్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.