నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని గంగాస్థాన్ ఫేస్ -2 మాల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎడ్ల గంగాధర్, ఉపాధ్యక్షులుగా బెల్లడిగి చంద్రకాంత్, చంటి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా మక్కం గంగాధర్, కోశాధికారిగా సర్కాని హుల్య, సంయుక్త కార్యదర్శులుగా నీరడి సాయిలు, అల్జాపూర్ నాగారావు, కార్యవర్గ సభ్యులుగా వాగ్మారే యశ్వంత్, లైన్ భజరంగ్, బోడ వెంకటేశ్, బొమ్మిడి శ్రీనివాస్, పోతురాజు నర్సింలు, సలహాదారులుగా బొడ్డు లక్ష్మణ్, తుక్కడి నారాయణ, సుంకరి గంగాధర్, న్యాయ సలహాదారులుగా గాదారి చిన్నయ్య ఎన్నికయ్యారు.