బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బందును జయప్రదం చేయండి

వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్   బాన్సువాడ, బతుకమ్మ : బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు,బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు పిట్ల శ్రీధర్ అన్నారు.శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వ హించే బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు....