నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ఓబీసీ నగర అధ్యక్షుడు బాసోల నాగరాజ్ ఆధ్వర్యంలో ఆదివాంర మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా గురుద్వార్ దగ్గర దత్త మందిరంలో ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాసోల నాగరాజ్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ అంచలంచెలుగా ఎదుగుతూ ఇంకా ఉన్నత పదవులను ఆశించాలని దేవుని ప్రార్థించారు. సమస్య ఏదైనా పరిష్కారం కోసం ఆలోచించే నాయకుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే పరిపాలన అందించి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్ కోశాధికారి శివప్రసాద్, నగర ఓబిసి నాయకులు పాల్గొన్నారు.