హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయిన.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటార్ సునీత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.