Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 7:16 pm Posted by : ramakrishna

సోమవారం మాధవరావు సంతాప సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, మానవహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు అకాల మృతికి సంతాప సూచకంగా సోమవారం ఉదయం పదిన్నరకు జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో సంతాప సభ ఏర్పాటు చేసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట లో గల గొర్రెపాటి నివాసంలో మాధవరావు పార్ధీవశరీరానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో జీవించి,ప్రజా సంఘాలలో,మానవ హక్కుల వేదికలలో ప్రజల జీవిన విధానంలో సమాజిక,ఆర్థిక ,రాజకీయ మార్పులకు శ్రమించిన ప్రజల మనిషి మాధవరావు అని జగన్ కొనియాడారు. జిల్లాకోర్టు హల్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా జ్యూడిషియరి తరపున నివాళులు అర్పించిన అనంతరం బార్ సమావేశపు హల్ లో శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు జగన్ తెలిపారు.