సెప్టెంబర్ 10 తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్

హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియా చిట్ చాట్ లో  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  క్లారిటీ ఇచ్చారు. మొదట ఎంపీటీసీ,  జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని,  సెప్టెంబర్ 10 తర్వాత ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందన్నారు.  సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.