వేల్పూర్, బతుకమ్మ : ప్రమాధానికి గురై తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడు గంగపల్లి ప్రశాంత్ కు చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ ఓ సీ ని గురువారం అందజేశారు. యాక్సిడెంట్ కి గురైన తీవ్ర గాయాలతో చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరిన లక్కోర గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్ కు రూ.1,50,000 ఎల్ ఓ సీ ని మంజూరు చేయించి, హైదరబాద్ లోని నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చికిత్స కొరకు ఎల్ ఓ సీ ని మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు క్షత్తగాత్రుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.