భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన గంగామణి కి గుండె ఆపరేషన్ కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఎల్వొసీ అందజేశారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు రూ 1లక్ష 25 వేల రూపాయల ఎల్వొసి ని మంజూరు చేయించారు. ఎల్వోసీ ని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో అందజేశారు. ఎల్వోసీ అందజేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు అన్నారు .ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేములకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.