నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాలపల్లి ముజాయిత్ నగర్ కు చెందిన అభిబా కౌసర్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతు మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ను సంప్రదించారు. ఆయన సీఎం సహాయ నిధి పథకం ధ్వరా మంజూరైన రూ.4 లక్షల విలువ గల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తన మొదటి కర్తవ్యం అని ఏ ఒక్కరినీ ఆరోగ్య సమస్యలతో బాధపడనివ్వకుండా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పౌరునికి చేరవేయడమే తన లక్ష్యం అని తెలియజేసారు.