Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 5:55 pm Posted by : ramakrishna

ఎల్ఓసి అందజేత  

బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి  చెందిన మహమ్మద్ ఫత్తె అహ్మద్ కాలు ఇన్ఫెక్షన్ సోకి సర్జరీ అవసరం ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో కాలు ఆపరేషన్ కొరకు రూ.50 వేల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీ ని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన  ఆపరేషన్ కొరకు రూ.50 వేల ఎల్ఓసి ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేసారు.