భీంగల్, బతుకమ్మ: భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల బస్సు ప్రమాదానికి గురై చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా పేదవారైనా వారికీ చికిత్స కొరకు రూ.లక్ష ఎల్ వో సీ మంజూరు చేయించారు. సోమవారం వేల్పూర్ లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా గతంలో సర్జరీ కొరకు ఒక లక్ష ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కొరకు మరొక లక్ష ఎల్ వో సీ మంజూరు ఇచ్చినందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.