దూదిగాం వాసికి ఎల్ఓసి అందజేత
బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం దూదిగాం గ్రామనికి చెందిన షఫీ అనారోగ్యం కారణం గా నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.ఈ విషయం దూదిగాం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారి వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఎల్ఓసి ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్ర్యులు ప్రశాంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.