మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు
మోర్తాడ్, బతుకమ్మ: గ్రామాల్లోని యువత మత్తు గంజాయి పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తుపదార్థాలతో జీవితాలు చిత్తుకాగితాలుగా మారిపోతాయని మోర్తాడ్ ఎస్సై రాము అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్, పాలెం గ్రామాల్లో గురువారం పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును నిర్వహించారు. సైబర్ క్రైమ్ మోసాలకు ఎవరు బలి కావద్దని అపరిచిత వ్యక్తుల నుంచి నూతన ఆఫర్ లంటూ ఫోన్ కాల్స్ వచ్చిన లింక్ వచ్చిన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో సుంకేట్, పాలెం గ్రామాల ప్రజలు, యువకులు తదితరులు...