రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ – 4 లో సోమవారం కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సునంద మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం, ఇంగ్లీష్, తెలుగు విద్యా బోధన, ఆటలు, పాటలు, కథలు నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునంద, ఆయా సవిత, చిన్నారుల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.