Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 5:47 pm Posted by : ramakrishna

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు

బతుకమ్మ,వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడా గ్రామంలో నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంబించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ ఫౌండేషన్ చైర్మన్ వి.వి. లక్ష్మీనారాయణ సౌజన్యంతో ఈ గ్రంథాలయం స్థాపించారు. ఈ సందర్బంగా వక్తలు ఉపన్యసిస్తూ యువత ఈ గ్రంధాలయం ఉపయోగించుకొని వివిధ విషయాలపై అవగాహన పెంచుకోవాలని,  గ్రామస్థుల అందరి సహకారంతో గ్రంధాలయం నడుపుకోవాలని చెబుతూ, జే.డి. ఫౌండేషన్ వారి ఉన్నత ఆశయాన్ని కొనియాడారు. గ్రామస్తులు మాట్లాడుతూ జే.డి. ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సుంకెట, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి,  జేడీ ఫౌండేషన్ తెలంగాణ కన్వినర్ పింగిళి కవితా రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.