మల్కాపూర్(ఎ) తండాలో చిరుత సంచారం
బోను ఏర్పాటు చేయాలని వినతి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్(ఎ) తండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం చిరుత నాలుగు లేగదూడలను చంపింది. దీంతో స్థానికులు భయాదోంళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి బోను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, నవీపేట మండలంలోని పలుగ్రామాల్లో చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే.