గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
జక్రాన్ పల్లి, బతుకమ్మ : జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. జక్రాన్ పల్లి మండలం, సికింద్రపూర్ పడ్కల్ గ్రామ శివారులో లోని హైవే పైన గుర్తు తెలియని వాహనం చిరుత పులిని ఢీ కొట్టింది. రాత్రి జరిగిన ఈ ఘటనలో చిరుత కు గాయాలై మృతి చెందింది. సంఘటన స్థలానికి జక్రాన్ పల్లి ఎస్ఐ సిబ్బంది వెళ్లి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.