నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ కు ఆయా సంస్థల చైర్మన్ లు, పలువురు నాయకులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అతరెడ్డి రాజిరెడ్డి తదితరులు గడుగును కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైతు కమిషన్ సభ్యుడిగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు.