మోర్తాడ్, బతుకమ్మ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలో భాగంగా మోర్తాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఆలూరు నుండి ప్రారంభిస్తున్న పాదయాత్ర కోసం మోర్తాడ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జనత పాదయాత్రలో పాల్గొనడానికి మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయం నుంచి బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.