ఆత్మగౌరవ సభకు తరలిన నాయకులు

బాన్సువాడ , బతుకమ్మ  : నాగర్ కర్నూల్‌లో నిర్వహిస్తున్న మాల ఆత్మగౌరవ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బాన్సువాడ మండలం నుంచి మాల మహానాడు నాయకులు ఆదివారం తరలివెళ్లారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లూరి సాయిలు, వెంకటేశ్, నర్సింలు, జగన్, మోహన్, ప్రశాంత్, మన్నె చిన్న సాయిలు, శివయ్య, సురేష్, సాయిలు, వినోద్, జగ్గా ఆనంద్, వెంకట్ రత్నం, గుజ్జరి గంగారాం, విఠల్ పాల్గొన్నారు.