Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 2:00 pm Posted by : ramakrishna

జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జీవీఎస్ భరతలక్ష్మిని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆయనవెంట సీనియర్ న్యాయవాది వసంతరావు తదితరులు ఉన్నారు.