. . . జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన (తక్షణ రక్షణ) వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో స్పందన టీమ్లను ప్రారంభించారు. ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ పీస్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
