- తీసిన విద్యార్థి అదృశ్యం
- మిస్సింగ్ కేసు నమోదు
అచ్చంపేట్, బతుకమ్మ : అచ్చంపేట్ లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైనట్లు స్కూల్ ఇంచార్జీ ప్రిన్సిపాల్ జడ్డు జనార్ధన్ తెలిపారు. ఈనెల 19న స్కూల్ కు సంబంధించిన ల్యాప్ టాప్ మాయమైనట్లు గుర్తించామన్నారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా పదోతరగతి చదువుతున్న భూయర్ ఓంకార్ తీసినట్లు గుర్తించామన్నారు. విద్యార్థిని పిలిచి అడుగగా తానే ల్యాప్ టాప్ తీసినట్లు అంగీకరించాడని, సాయంత్రం తెచ్చి ఇస్తానని తెలిపాడని అన్నారు. ఆ విద్యార్థి ల్యాప్ టాప్ తీసుకురాక పోవడంతో మరుసటి రోజు అడిగగా ఆదివారం సాయంత్రం వరకు తెచ్చిస్తానని చెప్పాడన్నారు. అప్పటి నుంచి పదో తరగతి విద్యార్థి భూయర్ ఓంకార్ కనిపించలేదన్నరు. మద్నూర్ మండలం శక్కర్గ గ్రామంలో ఉన్న విద్యార్థి తల్లి దండ్రులకు విషయం తెలుపగా అక్కడికి కూడా రాలేదని అన్నారని తెలిపారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో విద్యార్థి మిస్ అయ్యాడని ఫిర్యాదు చేశామని తెలిపారు.