కార్మిక హక్కుల పోరాట యోధురాలు నూర్జహాన్ ఇక లేరు

  . . . గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో పోరాడి ఓడిన నూర్జహాన్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె, శనివారం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టైంది. నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ,...