హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించిన కేవీఆర్

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలోని పురాతన ఆలయం కోడూరి హనుమాన్ ఆలయాన్ని గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శనివారం సాయంత్రం దర్శించుకొని ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు.     ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జరగాల్సిన పనులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వచ్చే నెల జరిగే ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.