షకీల్ కు కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్, బతుకమ్మ: బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హైదరాబాద్ లో పరామర్శించారు. షకీల్ తల్లి ఇటీవల మృతి చెందారు. కేటీఆర్ వెంట నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.