వేల్పూర్, బతుకమ్మ : కాశ్మీర్ పహాల్ గావ్ దాడిలో అమరులైన హిందు పర్యాటకుల ఆత్మశాంతిని కోరుతూ మండలంలోని రామన్నపేట్ గ్రామ యువకులు కొవ్వత్తుల ర్యాలీని నిర్వహించారు. బుధవారం రాత్రి హనుమాన్ మందిర్ నుండి బస్ స్టాండ్ వరకు జాతీయ జెండాలను పట్టుకుని భరత్ మాతాకీ జై, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, మూర్ధబాద్ పాకిస్తాన్, ఖబర్దర్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. అసువులు బాసిన అమరుల ఆత్మశాంతికి మౌనం పాటించి, అమరులకు జోహార్లు తెలిపారు. అమరుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపి ఘటనకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని, అమరుల కుటుంబాలను ఆదుకోవాలని యువకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కొవ్వత్తుల ర్యాలీలో పార్టీలకు అతీతంగా హిందు యువకులందరు పాల్గొన్నారు.