రామాలయ పునర్నిర్మాణానికి కొత్తపల్లి రవికిరణ్ విరాళం అందజేత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల రామాలయ నిర్మాణంలో భాగంగా రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ 10 వేల రూపాయల విరాళాన్ని శుక్రవారం రామాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ నిర్వాహకులు పత్తి నవీన్, అడప వినోద్, బచ్చు పవన్, అడప నవీన్, వడ్ల నరేష్, కన్నె రవి, జువ్వల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.