బాధిత కుటుంబానికి కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం ..
రుద్రూర్(వర్ని), బతుకమ్మ : వర్ని మండల కేంద్రానికి చెందిన బావరిశెట్టి దుర్గాప్రసాద్, దుర్గాదేవి కుమారుడు యశ్వంత్ సాయి మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో 6 వ తరగతి చదువుతున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని వారు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించగా ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి ఒక సంవత్సరానికి స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు 30 వేల రూపాయలు మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ కి చెల్లించి వారి కుటుంబానికి రసీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు...