Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:32 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం ..

 

రుద్రూర్(వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండల కేంద్రానికి చెందిన బావరిశెట్టి దుర్గాప్రసాద్, దుర్గాదేవి  కుమారుడు యశ్వంత్ సాయి మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో 6 వ  తరగతి చదువుతున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని వారు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ని  సంప్రదించగా ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి ఒక సంవత్సరానికి స్కూల్ ఫీజు,  బుక్స్ ఫీజు 30 వేల రూపాయలు మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ కి చెల్లించి వారి కుటుంబానికి రసీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రెడ్డి వినోద్, వెంకటేష్, తాళ్లూరి సంతోష్, ఆలపాటి హరికృష్ణ , వివేకానంద ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్, జాస్తి అనిల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.