Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 11:04 pm Posted by : ramakrishna

కొండా సురేఖ, రఘునందన్ ఫోటోలని అసభ్యకరంగా చిత్రీకరించిన ఇద్దరు అరెస్టు

నిజామాబాద్, బతుకమ్మ – రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ ఫోటోలని అసభ్యకరంగా చిత్రీకరించిన ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిజామాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్ కు చెందిన మహేష్ అనే వ్యాపారవేత్తను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.