హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. పంచాయతీల్లో రిజర్వేషన్ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం ఆజారుద్దీన్ ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆజారుద్దీన్ ను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన సెప్టెంబర్ లోనే రానుందని సమాచారం.