కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాత కక్షలు కత్తి పోట్లకు దారితీశాయి. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. సుతారి రాజశేఖర్ ను రామేశ్వరంపల్లి డబల్ బెడ్ రూమ్ ప్రాంతం లో వెంచర్ వద్ద గంగని ప్రవీణ్ చాకుతో పొడిచాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గాయపడిన సుతారి రాజశేఖర్ ను ముందుగా కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ పై గతంలోనూ చోరీ కేసులను ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలోని ఈ దాడి జరిగిందని అంచనా వేస్తున్నారు.