Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 6:05 pm Posted by : ramakrishna

తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా కిషన్ రెడ్డి, మధుసుధన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జిల్లా  అధ్యక్ష, కార్యదర్శుల ను ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో తపస్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇందూరు జిల్లా అధ్యక్షులు గా నల్ల కిషన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి గా డింగరి మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు విభాగ్ ఎన్నికల అధికారి వరంగంటి శ్రీనివాస్, జిల్లా ఎన్నికల అధికారి పాప గారి రామకృష్ణ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ,జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, జోనల్ ఇంచార్జ్ రవీంద్రనాథ్ ఆర్య ,కీర్తి సుదర్శన్ ,యార్లగడ్డ రాఘవేందర్ ,కర్నే శంకర్, రుద్ర మధుసుధన్ , బట్టు బద్రీనాథ్ , పరళి కృష్ణవేణి,  ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Kishan Reddy and Madhusudhan as Tapas District President Secretaries