నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలలోని ఖుద్వాన్ పూర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం చల్లి కొట్టిన శంకర్ అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.