Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 7:19 pm Posted by : ramakrishna

కిలాడీ లేడీలు అరెస్ట్

  • దొంగిలించిన సొత్తు రికవరీ

 

బతుకమ్మ, కోటగిరి : ఉమ్మడి మండల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం  గత నెలలో  పోతంగల్ మండల కేంద్రంలోని జరిగిన దొంగతనాలలో అనుమానితులుగా ఉన్న ఇద్దరు మహిళలను కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద పట్టుకొని వారిని విచారించి వారి వద్ద నుండి 6.9 గ్రాముల బంగారం, 44.51 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ సుమరు 72557 రూపాయలు  ఉంటుందని ఆయన తెలిపారు.  పోతంగల్ గ్రామనికి చెందిన మొండి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రిమాండ్ కోసం బోధన్ కోర్టులో హాజరు పరుచుతామని ఆయన తెలిపారు.