కొనసాగుతున్న ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర
హైదరాబాద్, బతుకమ్మ : ఖైరాతాబాద్ మహాగణపతి శోభాయత్ర వేలాది భక్తుల మధ్య కొనసాగుతోంది. రాజ్ ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్ లో నాలుగో నంబర్ స్టాండ్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలిక్రేన్ ను ఏర్పాటు చేశారు. ఈశోభాయత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. శనివారం ఉదయం 10గంటలకు రాజ్ దూత్ సర్కిల్ వద్దకు శోభాయత్ర చేరుకుంది. శోభాయత్ర నెమ్మదిగా కొనసాగుతోంది.