ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలోని కేజీబీవీని ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రూ.3.5కోట్ల నిధులతో చేపడుతున్న అదనపు గదుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.