తిరుమల, బతుకమ్మ : తిరుమల కల్తీ నెయ్యి కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. రెండు రోజులుగా ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్న తో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను సిట్ విచారిస్తుంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు అరెస్టయినవారిలో ఉన్నారు.