బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్ ఇష్టాగోష్టి

హైదరాబాద్, బతుకమ్మ : సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యనేతలతో ఆయన శుక్రవారం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.