హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యనించారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారని కేసీఆర్ వాడుకున్నారని, ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మళ్లీ సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మూడు రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని ఆరోపించారు. ఉద్యమంలో పేదలు, విద్యార్థుల ఆత్మార్పణం చేసుకునన్నారని పేర్కొన్నారు. వారి త్యాగాలతో వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పదేళ్లు దోచుకుందన్నారు. సోనియా గాంధీతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆయన అన్నారు.