Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 2:12 pm Posted by : ramakrishna

రాష్ట్రాన్ని బాకీ పడేలా చేసింది కేసీఆర్ కుటుంబమే

హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రాన్ని బాకీ పడేలా చేసింది కేసీఆర్ కుటుంబమేనని  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే,  11 నెలల్లోనే 65 వేల ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట్టా?  అని ఆయన ప్రశ్నించారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఏర్పాటు, హామీలు నెరవేర్చడం, బీసీ రిజర్వేషన్లు.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనాలని పేర్కొన్నారు.