Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 3:25 pm Posted by : ramakrishna

ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాభవన్ కు చేరుకున్నారు. ఏడు నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయనికి బుధవారం ఆయన వచ్చారు. బీఆర్ ఎస్ విస్తత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.  పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడున్న సందర్భంలో భారీ బహిరంగసభ,  ఆవిర్భావ వేడుకలు, సభ్యత్వ నమోదు అంశాలుపై చర్చించి నిర్ణయంతీసుకోనున్నారు. కాంగ్రెస్  ప్రభుత్వ వ్యతిరేక  విధానాలపై చేపట్టాల్సిన కార్యచరణ విషయమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్న కేసీఆర్

కేసీఆర్ ముందుగా సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు. తనపాస్ పోర్టును రెన్యూవల్ చేయించుకున్నారు.  వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా పర్యాటనకు వెళ్లనున్నారు.