Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 11:33 am Posted by : ramakrishna

విచారణకు హాజరైన కేసీఆర్

హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్లో ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ కే భవన్ లోకి వెళ్లిన కేసీఆర్ తో పాటు 9 మంది నేతలకు అనుమతి లభించింది. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.