Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 6:25 pm Posted by : ramakrishna

ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రౌడీషీటర్ రియాజ్ దాడిలో గాయపడి మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ధైర్యంగా ఉండాలని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Kavitha visits Pramod's family