ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో మంగళవారం కార్గిల్ విజయ్ దివాస్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఆర్మీ డ్రెస్ లలో అందరినీ ఎంతగానో అలరించారు. కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ అమరవీరులను వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేశం కొరకు సాయిధ దళాల పాత్రను బలప్రదం చేయడానికి విజయ్ దివాస్ భారత దేశంలో జరుపుకుంటామని, 1971 డిసెంబర్ 16న భారతదేశం పాకిస్థాన్ తో తలబడి విజయాన్ని సాధించినందుకు గాను విజయ్ దివస్ జరుపుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
